Chapter 20

1 ఆ అల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన దగ్గరకు పిలువనంపించి హెచ్చరించిన తర్వాత వారియొద్ద సెలవు పుచ్చుకొని 2 మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను. .ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. 3 అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్లవలెనని అనుకున్నాడు అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకున్నారు 4 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితోకూడ(కొన్నిప్రాచీన ప్రతులలో-ఆసియవరకు) వచ్చిరి. 5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి. 6 పులియని రొట్టెల రోజులైనా తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపాము. 7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కలసినప్పుడు, పౌలు మరో దినము వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు చాలా సమయము వరకు మాటలాడుచుండెను. 8 మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. 9 ప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను. 10 .అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతను మరణించలేదు అతని ప్రాణము అతనితోనే ఉన్నది అని చెప్పెను. 11 .అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు చాలా సమయము వరకు సంభాషించి బయలుదేరెను. 12 .వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. 13 .మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లము. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను. 14 .అస్సులో అతడు మాతో కలిసికొనినప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితు లేనేకు వచ్చితిమి. 15 .అక్కడ నుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చిము. మరునారోజు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చాము. 16 .సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో పౌలు ఆతురపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను. 17 .అతడు మిలేతునుండి ఎఫెసునకు సమాచారం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. 18 .వారు తనయొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే తెలుసు. 19 .యూదుల కుట్రలవలన నాకు శోధనలు వచ్చాయి, కన్నీళ్లు విడుచుచు పూర్తి వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును. 20 .మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, 21 .దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును. 22 .ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏ ఏ విషయాలు జరువుతాయో తెలియదు కానీ, 23 .బంధకములును శ్రమలును నాకొరకు ఎదురు చూస్తూ ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. 24 అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. 25 .ఇదిగో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును. 26 .కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనన నేను దోషిని కాకూడదని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.(లేక-మీకు సాక్ష్యమిచ్చుచున్నాను) 27 .దేవుని ఆలోచన మీకు తెలుపకుండ నేనేమి దాచుకొనలేదు. 28 .దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కా పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండుడి. 29 .నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలోనికి వస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. 30 .మరియు శిష్యులను వారితో పాటు ఈడ్చుకొని వెళ్లాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. 31 .కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని జాగ్రత్తగా ఉండండి. 32 .ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్యమను మీకు ఇవ్వడానికి శక్తి కలవాడు. 33 .ఎవరి వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు; 34 .నా అవసరాల గురించి నాతో ఉన్నవారి గురించి ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. 35 .మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. 36 ఆయన ఈలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను. 37 .అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పినమాటకు విశేషముగా బడపడుచు 38 .పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.